NRML: పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9719 మంది విద్యార్థులకు గాను 9714 మంది హాజరయ్యారు. బాలురు 4792 మందిలో 4789 మంది, బాలికలు 4927 మందిలో 4925 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 5 మంది గైర్హాజరయ్యారని డీఈవో భోజన్న ఓ ప్రకటనలో తెలిపారు.