ADB: ప్రతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రూ. 48 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు భూమి పూజ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు.