MDCL: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం చుట్టూ BNS- 189 సెక్షన్ (IPC- 144) అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్రాల పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా వహిస్తున్నట్లు వెల్లడించారు.