SRCL: రుద్రంగి మండల కేంద్రంలో కొలువైన శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి, ముంజ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.