WGL: కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఏర్పాట్లను DCP అంకిత్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. గతంలో చోటుచేసుకున్న రాజకీయ వివాదాల దృష్ట్యా ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతలను కాపాడాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని సూచించారు.