ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ఆపద సమయాల్లో ధైర్యంగా తలపడేలా, వారి రక్షణకు వారే పూనుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ మేరకు శిక్షణ పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.