PDPL: గోదావరిఖని మేదరి బస్తీకి చెందిన పిల్లి కుమార్ అనే వ్యక్తి, ఇంటి పైకప్పుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ ఎలాంటి పని చేయకపోగా, కొద్ది రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. భార్య రజిత కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుందని వెల్లడించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.