NGKL: ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 5 వరకు వైభవంగా జరగనున్నాయి. రేపు అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. మార్చి 2న స్వామివారి కళ్యాణం, 3న రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 4న అశ్వ వాహన సేవ, 5న నాగవెల్లి తో వేడుకలు ముగియనున్నాయి. భక్తులు భారీగా తరలిరావాలని ఆలయ కమిటీ కోరింది.