HYD: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ మలక్ పేట మార్కెట్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ అధ్యక్షుడు చేగురి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, రైతులు, కొనుగోలుదారులు, హమాలీలు, అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు.