PDPL: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు జేఏసీ ఉమ్మడి జిల్లా ఛైర్మన్ తూళ్ల నాగరాజు ప్రకటించారు. మంగళవారం పెద్దపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7న ‘చలో వరంగల్’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.