NRML: పెంబి మండల కేంద్రంలోని శివారులో ఎస్సై హనుమాన్లు నాకాబంది చేపట్టారు. ఇందులో భాగంగా పలు ద్విచక్ర వాహనాలు, కార్లు, గూడ్స్ వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం పలువురిని ఫింగర్ ప్రింట్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని పలు వాహనాలకు చలానాలు విధించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.