SRD: బీజేపీ పాలనతోనే సమగ్ర గ్రామాభివృద్ధి జరుగుతుందని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి అన్నారు. శనివారం కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామానికి ఆయన సందర్శించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు, తెలంగాణ రాష్ట్రంలో సక్రమంగా అన్ని గ్రామాలకు మళ్లించడం లేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.