MLG: జంగాలపల్లి గ్రామంలోని బ్రాహ్మణి విద్యాలయంలో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పట్ల గౌరవభావన పెంపొందించుకోవడం ప్రతివిద్యార్థి కార్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబ విలువలు, సంస్కారం,పెద్దల పట్ల గౌరవం విద్యార్థుల్లో పెంపొందుతాయని వారు పేర్కొన్నారు