MBNR: ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడంవల్ల నిరాపరాదుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ట్రాఫిక్ ఎస్సై రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో మద్యం సేవించి ఆటోలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 5 మంది డ్రైవర్లకు కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించిందన్నారు. మద్యం మత్తులో ఆటోలు నడపడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.