NRML: గత ఆరు నెలలుగా సరైన విధి విధానాలు లేక లైసెన్సుడ్ సర్వేయర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్ల కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే ఏలేటికి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6500 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యామని, ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు.