HYDలో కస్టమర్లు తీసుకోని పార్సిళ్లను వేలం వేయనున్నట్లు RTC కార్గో విభాగం ప్రకటించింది. ఫిబ్రవరి 27న సికింద్రాబాద్ జేబీఎస్ కార్గో కార్యాలయంలో ఈ వేలం జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ వేలంలో సుమారు 60 రకాల సరుకులు అమ్మకానికి ఉంటాయి. వస్తువులు అసలు ధర కంటే గరిష్టంగా 30% తక్కువ ధరకు లభించే అవకాశం ఉందన్నారు.