VKB: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి పదో వార్డులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి గురువారం పర్యటించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాలు తదితర అంశాలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి పరిస్థితిని వివరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు.