KNR: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం సాధించిన సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించడానికి మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రేపు మ.12 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు.