NZB: ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి నిజామాబాద్కు ఓట్లు అడగటానికి వచ్చారో సమాధానం చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ దేవుళ్లపై ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలను ఏ గంగలో కలిపారని ధ్వజమెత్తారు. సిద్ధులగుట్టపై ఒట్టు పెట్టి ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.