WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ భద్రకాళి ఆలయాన్ని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు MLA తెలిపారు.