KNR: తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో గుర్తుతెలియని జంతువులు రైతు గడ్డం శ్రీనివాస్కు చెందిన లేగ దూడపై దాడి చేశాయి. ఈ దాడిలో దూడ తీవ్రంగా గాయపడింది. ఘటనపై ఫారెస్ట్, వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. దాడి చేసిన జంతువులను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.