RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 35,29,000 విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ నిధి ఒక గొప్ప భరోసా అని పేర్కొన్నారు.