ADB: నెరడిగొండ మండలంలోని లక్కంపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాథోడ్ జీవన్ మాట్లాడుతూ.. పశుపోషకులు తమ పాడి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.