BDK: రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు, సూచించారు. బుధవారం అశ్వరావుపేటలో నిర్వహించిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనం నడుపుతున్నప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాలని, చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు.