సిద్దిపేట: చేర్యాల కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, చేర్యాల నకాషి బొమ్మను బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని దిశానిర్దేశం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.