KMM: మధిర పట్టణంలో ఇటీవల ప్రారంభమైన వంద పడకల ప్రభుత్వాసుపత్రి అప్పుడే సమస్యలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. చూడటానికి కోటలా ఆసుపత్రి ఉన్న పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. దీంతో మధిరలో పేదోడికి వైద్యం అందరాని ద్రాక్షగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.