ADB: గుడిహత్నూర్ మండలంలోని పీఆర్ రోడ్డు నుంచి సోమార్పేట్ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.44 కోట్లతో భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని, భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు.