KMM: మధిర మున్సిపల్ ఛైర్పర్సన్ సామినేని సుజాత బుధవారం 10వ వార్డులోని ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. పిల్లల ఆట పరికరాల మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ శుభ్రత, టాయిలెట్లకు నీటి సౌకర్యం వంటి పనులను పర్యవేక్షించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ సంపత్ కుమార్ను ఆదేశించారు. ఆట స్థలంలో ఇసుక పోయించి సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.