BDK: సుజాతనగర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం హెల్త్ మిషన్ 100లో భాగంగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి రమేష్ కుమార్ గురువారం తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, పల్మనాలజీ, డెంటల్ విభాగాలకు చెందిన నిపుణులు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.