NLG: దేవరకొండ పట్టణంలోని 13వ వార్డుకు చెందిన ప్రముఖ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అబ్దుల్ అలీముద్దీన్ మృతి పట్ల ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులకు ఈ బాధను భరించే ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ప్రార్థించారు. ఈ పరామర్శలో ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.