మెదక్: తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన విద్యార్థి పవిత్ర జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడంతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సన్మానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జీఎఫ్ క్రీడల్లో అండర్-14 విభాగంలో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపిక కావడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.