గద్వాల పట్టణంలోని ఓ ఈవెంట్ హాల్లో ఆదివారం ఓ పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 22 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు గురువులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.