KMR: మద్యానికి బానిసై వ్యక్తి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన అన్నారం యాదగిరి(53)అనే వ్యక్తి భార్య కళావతి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఆయన మద్యానికి బానిసై డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. శుక్రవారం సాయంత్రం స్థానిక పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.