WGL: వసంత నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా WGL జిల్లా కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి.. లక్ష లిల్లీ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.