BDK: రేపు జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటిస్తారని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని సూరారం తండా వెంకన్నపాలెం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవాలు చేస్తారని వారు తెలిపారు. అనంతరం జూలూరుపాడు మండల కేంద్రంలోని అధికారులతో కలిసి ప్రజాపాలన ప్రగతి-ప్రణాళిక సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.