ఖమ్మం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏజెంట్ల మధ్య మార్చి 4వ తేదీన జరిగిన గొడవలో టీ. చంద్రశేఖర్ (53) అనే పోస్టల్ ఏజెంట్పై తోటి ఏజెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి ముఖానికి గాయాలవ్వగా, ఖమ్మం వన్ టౌన్ ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి నుంచి “ఆన్ సైట్” ఫిర్యాదును స్వీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.