MULG: వెంకటాపూర్ మండలం పాలంపేట కాకతీయుల కాలం నాటి కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయని మాజీ మావోయిస్టు అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు (ఆశన్న) అన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం గైడ్లు విజయ్ కుమార్, వెంకటేష్ వద్ద నుంచి రామప్ప దేవాలయ చరిత్ర గురించి ఆశన్న తెలుసుకున్నారు.