WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25వ వార్డులో గురువారం పారిశుద్ధ పనులను టీపీసీసీ సభ్యుడు పెండం రామానంద్ పరిశీలించారు. మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.