NLG: మునుగోడులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పాఠశాల నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై అధికారులతో ఫోన్లో మాట్లాడి, వెంటనే పనులు మొదలుపెట్టాలని సూచించారు.