KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ GP పరిధిలోని ఎర్రారం గ్రామానికి చెందిన దూదేకుల జాంగిర్ జీవన ఉపాధి కోసం మెదక్ వెళ్లి సోడాలు అమ్ముకుంటు ఉండేవాడు. మద్యానికి బానిసై పోచారం డ్యామ్లో పడి సూసైడ్ చేసుకున్నట్లు అతని భార్య శన్ను పోలీసులకు ఫిర్యాదు చేశారు.