WGL: రాయపర్తి మండలం శివరామపురంలో తాగునీటి బోర్ల మోటార్లకు శుక్రవారం మర్మమత్తుల కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ పెద్దగోని నాగరాజుగౌడ్ వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో చెడిపోయిన మోటార్లను బయటకు తీసి వాటిని రిపేర్ చేశారు. అనంతరం మళ్లీ బోర్లలో మోటార్లను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.