MNCL: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన దానికి తలూపుతున్న ప్రధాని మోడీ ఇరాన్పై యుద్ధం ఆపి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన సెమినార్లో మాట్లాడుతూ.. యుద్ధంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి నెలకొందని, వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.