NZB: టీయూ పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యార్థుల రెగ్యులర్ 2, 4, 6, బ్యాక్ లాగ్ 1, 3, 5 (2021 నుంచి 2025 వరకు) సెమిస్టర్ల పరీక్ష ఫీజుల గడువును మళ్లీ పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఇది వరకే పరీక్షల షెడ్యూల్ను ప్రకటించామని పేర్కొన్నారు. ఈ నెల 8లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్నారు.