NGKL: హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య కరమైన జీవన విధానాన్ని అవలంబించడానికి సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.