MHBD: పేద కుటుంబాలను ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను అందజేస్తుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె ఇవాళ తొర్రూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్థిదారులకు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని తెలిపారు.