KMM: కూసుమంచి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు గాను ఆరు ఏకగ్రీవం కాగా మిగిలిన 35 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 45 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.