KNR: జిల్లా విద్యాశాఖ నిర్వహించిన పీఎం మోడల్ యునైటెడ్ నేషన్స్, స్పెల్ బీ పోటీల్లో శంకరపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 9వ తరగతి విద్యార్థిని చైత్రిక మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికవ్వగా, సహస్ర స్పెల్ బీలో విజేతగా నిలిచింది. 16 పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభచూపిన విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు.