ADB: గాదిగూడ మండలంలోని అర్జుని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెస్రం శేఖర్ బాబు గురువారం 23వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముత్నూరుకు చెందిన ఓ బాలింతకు బీ-పాజిటివ్ రక్తం అవసరం ఉందని ITDA హెల్ప్ డెస్క్ సూచించిందన్నారు. అయితే.. మానవ సేవయే మాధవ సేవ అనే ఆలోచనతో ఇప్పటి వరకు 23 సార్లు తన రక్తాన్ని దానం చేశామన్నారు.