KMR: బాన్సువాడ పట్టణంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం పరిశీలించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలను పరిశీలించి భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఎలాంటి చిన్న ఘటన కూడా చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.