కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించగా, సీతారామచంద్రస్వామి విగ్రహాలను వధూవరులుగా ముస్తాబు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరుగుతున్న ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్-అపర్ణ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.